కాకినాడ తీరంలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యం

Update: 2020-10-15 10:10 GMT

కాకినాడ తీరంలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. మచిలీపట్నం తీరంలో బోటును గుర్తించారు అధికారులు. బోటులోని ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ నెల 7న చేపలవేటకు మత్స్యకారులు వెళ్లగా ఇంజిన్ సమస్య తలెత్తడంతో సముద్రం మధ్యలో బోటు ఆగిపోయింది. ఇక అదే సమయంలో తీవ్రవాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీయడంతో బోటు దారి తప్పినట్టు తెలుస్తోంది.

Full View

 

Tags:    

Similar News