జనసేన అధినేత పవన్ కల్యాణ్. పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక, అక్కయ్యపాలెం, తిరుపతి, హైదరాబాద్ బహిరంగ సభల్లో పాల్గొన్న జనసేనాని…టీడీపీ, వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించామని మరోసారి స్పష్టం చేశారు. తిరుపతి, హైదరాబాద్లో జనసేన-బీఎస్పీ సంయుక్తంగా నిర్వహించిన సభల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొన్నారు.