Gudivada: సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించడంపై తీవ్ర విమర్శలు

Gudivada: టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడలో క్యాసినో గేమ్స్‌పై విచారణ

Update: 2022-01-19 06:12 GMT

క్యాసినో గేమ్స్‌పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశం

Gudivada: సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో తరహా జూదాలను నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్యాసినో గేమ్స్‌పై విచారణ చేసేందుకు ప్రత్యేక అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ నియమించారు. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెక్షన్‌ సెంటర్‌లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దాదాపు 500 కోట్ల మేర జూదం నిర్వహించారని, ఇతర అసాంఘిక చర్యలకు తెరతీశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు సోమవారం జిల్లా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను నియమించి క్యాసినో గేమ్స్‌పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.

Tags:    

Similar News