అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాలతో ఆంధ్రప్రదేశ్ అతిధులకు ఆతిధ్యం ఇచ్చారు. ఈ విందులో జగన్ తోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధిని కోరారు. అనంతరం అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశమై చర్చించారు. అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా సెంటర్కు చెందిన ఇర్ఫాన్ నూరుద్దీన్ కూడా సీఎంను కలిశారు.