Independence Day 2020: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌

Update: 2020-08-15 04:12 GMT

Independence Day 2020: 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



Tags:    

Similar News