ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న సీఎం రమేష్ పుట్టా ఇంటికి చేరుకున్నారు. అంతేకాదు .. నేతలు కార్యకర్తలు కూడా ఆ ఇంటికి చేరుకొని బీజేపీకి వ్యక్తిరేకంగా నినాదాలు చేశారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు.