Pawan Kalyan: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారు..

Pawan Kalyan: కేసు సుమోటోగా తీసుకున్నందుకు హెచ్‌ఆర్సీకి ధన్యవాదాలు

Update: 2023-07-17 09:27 GMT

Pawan Kalyan: శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారు

Pawan Kalyan: ఆందోళన చేస్తున్న వారిపై చేయి చేసుకోవడం.. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమే అన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ అంజూ యాదవ్ ‌చేయి చేసుకోవడం సరికాదన్నారు. జనసేన నేతలు క్రమశిక్షణ కలిగిన నేతలు అని.. మచిలీపట్నం సభలో లక్ష మంది జనం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశామని తెలిపారు పవన్‌. సీఐ చేయిచేసుకున్న ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌ సుమోటోగా కేసును తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News