పండగపూట విషాదం : లారీ ఢీకొని భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
పండగ వేళ ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. దీంతో భర్త మృతిచెందాడు
పండగ వేళ ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. దీంతో భర్త మృతిచెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని గ్రంథాలయం సమీపంలో ఆదివారం జరిగింది. ముమ్మిడివరం గ్రామానికి చెందిన మాకే శ్రీనివాస్(30) , ఆయన భార్య ఇద్దరు కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా..భార్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.