శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత

Update: 2019-09-09 10:23 GMT

కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. నాలుగు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. 4 క్రెస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేరకు తగ్గించి నీటి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది, దాని ఉపనదులకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండటంతో శ్రీశైలం డ్యామ్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. 

Tags:    

Similar News