Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Andhra Pradesh: పైపుల లోడు లారీలో నగదు తరలిస్తుండగా స్వాధీనం

Update: 2024-05-09 03:46 GMT

Andhra Pradesh: ఎన్నికల వేళ.. రూ.8 కోట్లు పట్టుబడిన నగదు

Andhra Pradesh: ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొనసాగుతుండడంతో పలుచోట్ల కరెన్సీ భారీగా పట్టుబడుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 8 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తోన్న పైపుల లోడు లారీలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News