ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌, భవనం ఎక్కిన టీడీపీ నేతలు

*వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందంటూ ఆందోళన

Update: 2022-09-20 06:24 GMT

ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌, భవనం ఎక్కిన టీడీపీ నేతలు

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందంటూ టీడీపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న ఓ భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. దళిత ద్రోహి సీఎం అంటూ నినాదాలు చేశారు. వెంటనే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తమవడంతో.. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News