తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిని ఎంట్రీ పాయింట్లోనే పరిశీలించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది.
ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్కు హైకోర్టును ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటిషన్ వేశారు.