జార్ఘండ్, బీహార్ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు... ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడే చోట నివాసం ప్రమాదకరమని అంటున్నారు.