విజయవాడ వాసులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Update: 2019-08-23 04:08 GMT

విజయవాడ వాసులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేదవారి సొంతింటి కల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుంది. వెయ్యి ఎకరాల స్థలంలో పేదవారికి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఎకరానికి వంద ఇళ్ళు నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.1000 కోట్ల రూపాయలు కేటాయించింది. నగర శివారులో స్థలం అన్వేషణ చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.

Tags:    

Similar News