Tirumala Laddu: భక్తులు లేక మిగిలిపోయిన శ్రీవారి లడ్డులు.. టీటీడీ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రతి రంగం పైన పడింది. ఇక ఈ వైరస్ ప్రభావం వలన ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలు మూసివేశారు.

Update: 2020-03-21 06:01 GMT
Tirumala laddu

కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు ప్రతి రంగం పైన పడింది. ఇక ఈ వైరస్ ప్రభావం వలన ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలు మూసివేశారు. అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. దీనితో భక్తుల కోసం ముందే ఏర్పాటు చేసిన రెండు లక్షలకి పైగా లడ్డులు మిగిలిపోయాయి.

ఈ నేపధ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు (శనివారం) టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొకరికి పది లాడ్డులను ఉచ్చితంగా పంపిణీ చేయనున్నారు. ఇక ఎప్పటిలాగే స్వామివారికి పూజలు యధావిధిగా జరుగుతున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News