కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

కర్నూల్ జిల్లా నందికొట్కూరులో టీడీపీకి షాక్ తగిలింది.

Update: 2020-03-14 07:14 GMT
Former MLA Ijayya joins in YSRCP

కర్నూల్ జిల్లా నందికొట్కూరులో టీడీపీకి షాక్ తగిలింది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీలో చేరారు. వైసీపీ రాయలసీమ రీజినల్‌ కోఅఆర్టినేటర్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌, నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఐజయ్య తోపాటు టీడీపీకి చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, జిల్లా టీడీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్ శింగారం రంగా తదితరులు వైసీపీలో చేరారు. కాగా ఐజయ్య 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో టీడీపీలో చేరి పోటీ చేశారు. అయితే 30 వేలకు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆర్ధర్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిని ఒప్పించి ఆ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News