రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకే విదేశాలకు వెళ్లానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఉపాధి కల్పించాలని పని చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానానికి వచ్చామన్నారు. కియా మోటార్ను తీసుకొచ్చామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించేందుకే రేయింబవళ్లు తిరిగానన్నారు. బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. నన్ను విమర్శించే ముందు మీ సంగతి చూసుకోండన్నారు. ఏ విచారణకైనా తాను రెడీనని చంద్రబాబు పేర్కొన్నారు.