గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద టాటా ఏస్- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నరసరావు పేట శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు ఫిరంగిపురం మండలం పుట్టకోట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.