Kurnool: అప్పుల బాధతో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య...

Kurnool: తమ పొలంలోనే పురుగుల మందు తాగి మృతి...

Update: 2021-12-10 07:12 GMT

Kurnool: అప్పుల బాధతో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య...

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. కొత్తూరుకు చెందిన వెంకటేశ్వర రెడ్డి, వెంకటగిరికి చెందిన కృష్ణయ్యలు పండించిన పంటలు చేతికి రాక, మరోవైపు పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీలు భారమై పోవడంతో దిక్కుతోచక తమ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News