రాజధాని మార్పు ఫిక్స్.. దొనకొండ వద్దు.. ఆ ప్రాంతాన్ని చేయండి : చింతామోహన్‌

Update: 2019-08-21 09:11 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఇప్పటికే జగన్ చర్చలు కూడా జరిపారని చెప్పారు. రాజధానికి దొనకొండ సరైన ప్రాంతం కాదని.. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కాగా మంగళవారం మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిపై రాష్ట్ర రాజధానిగా అమరావతి సురక్షితం కాదన్న శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక వాస్తవమేనని ఇప్పుడు అనిపిస్తోందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News