వారు వీడితే టీడీపీ మనుగడ కనుమరుగే : మాజీ సీఎస్ ఐవైఆర్

Update: 2020-01-19 03:42 GMT

బీజేపీ , జనసేన పార్టీ పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ , బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. వెనుకబడిన తరగతుల నాయకత్వం టీడీపీని వీడితే ఆ పార్టీ మనుగడ కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. అలాగే బీజేపీకి సూచన చేస్తూ.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'తెదేపా ప్రధాన బలం పార్టీ వెంట ఉన్న వెనుకబడిన తరగతులు వారి నాయకత్వం. జనసేన పొత్తు తర్వాత భాజపా ప్రధాన దృష్టి ఈ వెనుకబడిన తరగతుల నాయకత్వాన్ని తమ పార్టీలోకి ఆకర్షించు కోవడం మీద ఉండాలి.

ఈ నాయకత్వం టిడిపిని వీడితే ఆ పార్టీ కనుమరుగు అవ్వటం ఖాయం. ఆ స్థానాన్ని ఈ నూతన కూటమి ఆక్రమించ వచ్చు' అని ఐవైఆర్ ట్వీట్ చేశారు. కాగా ఏపీలో బీజేపీ , జనసేన పార్టీలు ఈనెల 17న పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తు గురించి మాట్లాడానికి గతవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జయప్రకాశ్ నడ్డాతో చర్చలు జరిపారు. 


 

Tags:    

Similar News