మాజీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఏపీ ప్రభత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'అధికారంలోకి వచ్చాం కదా ఏదో కాస్త హడావిడి చేద్దామనుకుంటే తప్పులేదు. కానీ ఇల్లు పీకి పందిరేద్దామనే ఆలోచన చేయకూడదు కదా. మనకు తెలీనప్పుడు ఎవరైనా చెబితే వినాలి. కానీ వినరుగా! చివరికి ఈరోజు పోలవరం అథారిటీ కూడా చెప్పింది. ఇప్పటికైనా తలకెక్కుతుందో లేదో ఈ మేథావులకి.' ట్విట్టర్ లో అంటూ పేర్కొన్నారు.