తల్లిదండ్రులకు ఫీజుల భారాన్ని తగ్గించేందుకు.. జగనన్న విద్యా జీవన పథకం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు.. ఈ పథకంతో అన్ని కమ్యూనిటీల వారికీ నూటికి నూరు శాతం ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఉంటుందన్నారు. కుటుంబాలపై అధిక భారం మోపకుండా.. విద్యార్థులకు ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు, ఇతర ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని ఆయన పేర్కొన్నారు.