ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదైంది. ఆయన భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)లో ఈడీ పేర్కొంది. జులై 8న గాంధీపై సీబీఐ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. సీబీఐ కేసు ఆధారంగా గాంధీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆక్రమ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయనుంది.