'ఈ-కేవైసీ' ఎప్పుడైనా చేయించుకోవచ్చు..

Update: 2019-08-25 05:00 GMT

ఈ-కేవైసీకి గడువు లేదని.. ఎపుడైనా నమోదు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ-కేవైసీకి గడువులేదు, ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. కాగా 15 ఏళ్లలోపు పిల్లలకు రేషన్ కార్డ్ నమోదు గడువు సెప్టెంబర్ 15 వరకు.. 15 ఏళ్లపై బడిన వారు నమోదు చేసుకొనే గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగించారని ప్రభుత్వం ఇదివరకే చెప్పిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. 

Tags:    

Similar News