సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్కు లేఖ రాశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని సుధాకర్ ఆరోపించారు. మాస్కుల విషయం నుంచి అన్ని అంశాలను లేఖలో ఆయన పేర్కొన్నారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో పేర్కొన్నారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని సుధాకర్ వాపోయారు. పెదవిపై వచ్చిన మార్పులను సూచిస్తూ ఫొటోలు విడుదల చేశారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి రెఫర్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని లేఖలో సుధాకర్ పేర్కొన్నారు.