కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ.7,95,000 చెక్కులను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి దాతలు అందజేశారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణానికి చెందిన చెన్నంశెట్టి దుర్గాప్రసాద్ రూ.3,00,000, ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం వారు (మానేపల్లి నాగేశ్వరరావు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు రూ.2,00,000, దేవి క్లాత్ షోరూం రూ.1,00,000, కృష్ణా సిల్వర్స్ రూ.1,00,000, సూర్య జ్యువెలర్స్ రూ.25,000, దేవి జూవెలర్స్ రూ.25,000, గుప్త జ్యువెలర్స్ రూ.25,000 చొప్పున విరాళాలు అందజేశారు.