చంద్రబాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ : డీజీపీ కార్యాలయం

Update: 2020-02-19 06:13 GMT
చంద్రబాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ : డీజీపీ కార్యాలయం

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద చర్చ జరగుతోంది. ఆయనకు భద్రత తగ్గించారన్న ప్రచారాన్ని ఏపీ పోలీసులు తోసిపుచ్చారు. చంద్ర బాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ప్రకటించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.

దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేస్తామని ప్రస్తుతం183 మందితో భద్రత కల్పిస్తున్నామని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. అయితే విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News