AP Assembly: ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌ మంటలు

AP Assembly: పెగాసస్‌పై చర్చ జరపాలని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్‌

Update: 2022-03-21 05:00 GMT

ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌ మంటలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో పెగాసస్‌ మంటలు రాజుకున్నాయి. పెగాసస్‌ అంశాన్ని లేవనెత్తిన బుగ్గన పెగాసస్‌ స్పైవేర్‌ను గత టీడీపీ సర్కార్‌ కొనుగోలు చేసిందన్న బెంగాల్‌ సీఎం మమతా వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు. దీంతో పెగాసస్‌పై చర్చ జరపాలని స్పీకర్‌కు నోటీస్‌ ఇచ్చారు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి. అలాగే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి పెగాసస్‌ అంశాన్ని రిఫర్‌ చేయాలని కోరారు. మరోవైపు పెగాసస్‌ స్పైవేర్‌ను గత టీడీపీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ నుంచి కొన్నాదో లేదో తేల్చాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News