ఏపీలో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునేలా ఈ కమిటీ పరిశీలన జరపనుంది.
సముద్రపు నీటిని శుద్ధి చేయడమే డీశాలినేషన్. ఈ పద్ధతి ద్వారా ఉప్పు నీటిని మంచినీరుగా మారుస్తారు. ఈ నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు భూగర్భ జలాలను వాడుకోకుండా పూర్తిగా సముద్రపు నీటిని వాడుకునే విధంగా పరిశ్రమల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 70కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా.