ఎన్నికలకు ముందే వేరే పార్టీ.. ఈ పార్టీ అన్న భావన.. ఆ తర్వాత అందరూ ఒక్కటేనని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు నేరుగా డోర్ డెలివరీ చేసే దిశగా ప్రయత్నిస్తామన్నారు. అర్హత ఉన్న వ్యక్తికి పథకం ప్రయోజనాలు పొందకపోయినా, గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడినా నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్ చేయొచ్చన్నారు. కులమతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాల్సిందేనని తేల్చిచెప్పారు.