నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న జగన్

Update: 2022-07-20 03:26 GMT

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడ రేవును ఏపీ ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైసీపీ ప్రభుత్వం సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు సీఎం జగన్‌ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News