CM Jagan: టీటీడీ ఈవో కుమారుడి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్

CM Jagan: మధ్యాహ్నం 3గంటల తర్వాత ఈవో నివాసానికి చేరుకోనున్న సీఎం

Update: 2022-12-22 06:12 GMT

CM Jagan: టీటీడీ ఈవో కుమారుడి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్

CM Jagan: నేడు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ధర్మారెడ్డి సొంత గ్రామమైన పారుమంచాలలో సాయంత్రం కుమారుడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధర్మారెడ్డి నివాసానికి సీఎం చేరుకొని.. కుటుంబసభ్యులను ఓదార్చనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు, అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News