ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

Update: 2019-05-16 15:46 GMT

ఎన్నికల సంఘంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మోదీ డైరెక్షన్‌లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ తన 4 పేజీల లేఖలో ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో అల్లర్ల వెనుక అమిత్‌ షా పాత్ర ఉన్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డాకు. 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని 22 పార్టీలు చేసిన వినతిని ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల సంఘం అన్నాకా ప్రతి పార్టీ ఇచ్చే ఫిర్యాదును స్వీకరించాలని.. చంద్రబాబు డిమాండ్ చేశారు.

Similar News