ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ పేరు ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. విక్రమ్నాథ్ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 2004లో అలహాబాద్ లో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ డిగ్రీ చేసిన ఆయన 1986లో న్యాయవాద పట్టా అందుకున్నారు. అలహాబాద్ హైకోర్టులో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.