సత్తెనపల్లి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. మృతుడి కుటుంబానికి..

Update: 2020-04-20 09:01 GMT

సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలు తాళలేక గౌస్ అనే యువకుడి మృతి చెందడంపై చంద్రబాబు స్పందించారు. ఘటనపై  చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముస్లిం యువకుడిపై దాడిని ఖండించిన ఆయన.. పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మందుల దుకాణానికి వెళ్లిన వారిపై దాడి గర్హనీయమన్న చంద్రబాబు.. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నివర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Tags:    

Similar News