పార్టీ నాయకులతో సమావేశం కానున్న చంద్రబాబు
తెలుగు దేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చిచనున్నారు.
తెలుగు దేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చిచనున్నారు. పార్టీ క్యాడర్ కు దశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఇటీవలే చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం పార్టీ నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.