నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు : చంద్రబాబు

Update: 2019-09-11 03:20 GMT

ఛలో ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ పిలుపునిచ్చారు.


Tags:    

Similar News