Chandrababu: డ్రగ్స్ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి
Chandrababu: డ్రగ్స్ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి
Chandrababu: విశాఖ డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలే నిందితులుగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ వర్క్ షాపులో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. గతంల కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదన్నారు. డ్రగ్స్ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. డ్రగ్స్ పై సీఎం జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.