మెుంథా ఎఫెక్ట్.. నేడు, రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
Central Teams Visit: మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది.
మెుంథా ఎఫెక్ట్.. నేడు, రేపు ఏపీలో కేంద్ర బృందం పర్యటన
Central Teams Visit: మొంథా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. తుఫాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం నివారించగలిగారు. మూడ్రోజులపాటు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నష్ట నివారణకు రాత్రింబవళ్లు కృషి చేశారు.
అయితే, తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు నేడు కేంద్ర ప్రతినిధి బృందం పర్యటించనుంది. రెండు టీములుగా విడిపోయి మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు వెళ్లనున్నారు. నేడు ప్రకాశం, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో.. రేపు బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.