CM Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టు విచారణ

CM Jagan: కౌంటర్ దాఖలుకు నేటితో ముగియనున్న గడువు * ఎంపీ రఘురామ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయమన్న సీబీఐ కోర్టు

Update: 2021-05-26 06:26 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించగా.. ఇవాళ్టితో కౌంటర్ దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో ఇవాళ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయనున్నారు జగన్. కౌంటర్ దాఖలు చేశాక పిటిషన్‌పై వాదనలు విననుంది సీబీఐ కోర్టు.

Tags:    

Similar News