సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ కేసు

Update: 2019-08-28 07:36 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అక్రమంగా ప్రభుత్వ భూములను అమ్ముకున్నారంటూ రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాల భూమిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విక్రయించారని ప్రధాన అభియోగం. సోమిరెడ్డితోపాటు మరో ముగ్గురు నిందితులుగా చేర్చారు పోలీసులు. మరోవైపు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్నారు సోమిరెడ్డి.. ఇలాంటివన్నీ జరుగుతాయని తాను ముందే ఊహించానన్నారు.

Tags:    

Similar News