నేడు జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారానికి విరామం

Update: 2019-04-06 01:41 GMT

ఉగాది పండుగ సందర్బంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, పార్టీ నేత షర్మిల తమ ఎన్నికల ప్రచారానికి శనివారం విరామం ప్రకటించారు. తెలుగువారి కొత్త సంవత్సరాది అయిన ఉగాది రోజున ప్రతి ఇంటా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకునే సమయంలో ప్రచార సభలతో వారిని ఇబ్బంది పెట్టరాదనే ఉద్దేశంతో వారీ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. రేపటినుంచి యధావిధిగా ప్రచారం ఉంటుందని తెలిపింది వైసీపీ. ఇక అమరావతిలోని జగన్‌ స్వగృహంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. 

Similar News