జగన్ ప్రభుత్వం పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రధాన ప్రాజెక్టు, జలవిద్యుత్ కేంద్రం ఒకే టెండర్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరం పనుల్లో ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తీరు వల్ల దేశానికి కూడా చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఇలా వ్యవహరిస్తే ఏపీకి పరిశ్రమలు రావని అన్నారు. ఇప్పటికే బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదన్నారు.