Tirumala: టీటీడీ స్థలాలను కులసంఘానికి కేటాయించారని బీజేపీ నిరసన
Tirumala: హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఉద్యమిస్తామని హెచ్చరిక
Tirumala: టీటీడీ స్థలాలను కులసంఘానికి కేటాయించారని బీజేపీ నిరసన
Tirumala: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట బీజేపీ నిరసన చేపట్టింది. టీటీడీ స్థలాలను కులసంఘానికి కేటాయించారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి నిర్ణయాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పాలకమండలి నిర్ణయాలను వెబ్ సైట్లో పెట్టాలన్నారు. టీటీడీ నిధులను హిందూధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.