Andhra Pradesh: నా తప్పుంటే సీబీఐ కార్యాలయం ముందు ఉరి తీయండి- ఆదినారాయణ రెడ్డి

Andhra Pradesh: తిరుపతి బైపోల్‌కు ముందు వివేకా హత్య కేసు వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది.

Update: 2021-04-10 11:45 GMT

Andhra Pradesh: నా తప్పుంటే సీబీఐ కార్యాలయం ముందు ఉరి తీయండి- ఆదినారాయణ రెడ్డి

Andhra Pradesh: తిరుపతి బైపోల్‌కు ముందు వివేకా హత్య కేసు వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉందని తేలితే ఢిల్లీలో సీబీఐ కార్యాలయం ముందు తనను ఉరి తీసుకోవచ్చాన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి. కుంభకర్ణుడు 6నెలల తర్వాత నిద్ర లేచిన చందాన విజయమ్మ 25నెలల తర్వాత నిద్రలేచి లేఖ రాశారని విమర్శించారు. రాసిన లేఖ కూడా స్క్రిప్ట్‌లానే ఉంది కానీ వాస్తవాన్ని రాసినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీబీఐ దర్యాప్తు వద్దన్నారని ఆరోపించారు.

Tags:    

Similar News