టీడీపీకి బిగ్ షాక్
-టీడీపీకి రాజీనామా చేయనున్న దేవినేని అవినాష్ -రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న అవినాష్
తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీకి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుడ్బై చెప్పనున్నారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. గుణదలలో అభిమానులు, అనుచరులతో చర్చించిన అవినాష్.... టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మాటకు కట్టుబడి పనిచేసినా... అవినాష్కు... పార్టీలో తగిన న్యాయం జరగలేదని, అందుకే వైసీపీలో చేరుతున్నారని... దేవినేని నెహ్రూ అభిమానులు చెబుతున్నారు.