ఏపీ ఈఎస్ఐ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. మందుల కొనుగోళ్లలో ఏకంగా వందల కోట్లలో అక్రమాలు జరిగినట్లు బయటపడింది. మందులు సరఫరా చేయకుండానే కోట్లు కొట్టేసేందుకు ప్రణాళికలు రచించారు. ఏకంగా 300 కోట్ల మందులు, వైద్య సామాగ్రి కొనుగోళ్లపై అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన కార్మికశాఖ విచారణకు ఆదేశించింది. విచారణ బాధ్యతను కార్మికశాఖ డైరెక్టర్ కు మంత్రి జయరాములు అప్పగించారు.