టీడీపీ వీడటంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే

తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని కర్నూల్ జిల్లా బంగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Update: 2020-03-19 10:51 GMT
BC Janardhan Reddy (File Photo)

తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని కర్నూల్ జిల్లా బంగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. టీడీపీ అభిమానులు ఎవ్వరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని జనార్దన్‌రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను టీడీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని.. తనపై కావాలనే కొందరు ఇలా వికృత ప్రచారం చేస్తున్నారని.. తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడబోనని.. అందువల్ల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు.

అంతేకాదు తాను ఏ వైసీపీ నాయకుడి (సజ్జల రామకృష్ణారెడ్డి)నీ కలవలేదన్నారు. కావాలనే తనపై అసత్యపు ప్రచారాలను చేశారని చెప్పిన జనార్ధనరెడ్డి ఇటువంటి ప్రచారాలు మాని వైసీపీ వాళ్ళు అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. టీడీపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పిన జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.. చాలా మంది కార్యకర్తలు తన ఇంటివద్దకు వచ్చి అడుగుతుండంతోనే ఆయన ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.




Tags:    

Similar News