గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది ఆ పార్టీ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పార్టీ ఆఫీసులో జాతీయ పతకాన్ని ఎగురవేయనున్నారని ఆ పార్టీ వెల్లడించింది. సీఎం జగన్ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో విజయమ్మకు ఈ బాధ్యతలు అప్పజెప్పారు.